ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనగణనకు శ్రీకారం చుట్టింది.పంచాయతీ ఎన్నికల్లోపు జనగణను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. జనగణను పూర్తి అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లపై ఒక క్లారిటీ రానుంది. ఆ తర్వాత పంచాయతీ, స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది అని తెలుస్తోంది.2027 జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది మే 1 తేదీ నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియ చేపడుతున్నట్టు ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర జనగణన డైరెక్టర్ జే నివాస్ మంగళవారం భేటీ అయ్యారు. మే 1తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు ఈ సందర్భంగా జే నివాస్ తెలిపారు. వచ్చే నెల 15 నుంచి పాటు స్వీయగణన కార్యక్రమం ప్రారంభం కానుంది.రెండు దశలుగా 2027 జనగణన కార్యక్రమం గురించి సీఎంకు జే నివాస్ విరించారు.